Tuesday, June 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవికలాంగుల సంక్షేమ శాఖనుప్రత్యేక శాఖగా కొనసాగించాలి

వికలాంగుల సంక్షేమ శాఖనుప్రత్యేక శాఖగా కొనసాగించాలి

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం దశల వారి ఉద్యమం
ఈనెల 5 నుంచి 30 వరకు గ్రామాల్లో సర్వేలు
27న హెలెన్‌ కెల్లర్‌ జయంతి ఉత్సవాలు: ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించేందుకు, అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వికలాంగుల సమస్యలపై జూన్‌ 5 నుంచి 30 వరకు గ్రామాల్లో సర్వేలు నిర్వహిస్తుమని తెలిపారు. సర్వేలో గుర్తించిన సమస్యలపై దశల వారీగా ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. రచయిత, కవి, బధిరుల ఆశాజ్యోతి హెలెన్‌ కెల్లర్‌ 145వ జయంతి సందర్బంగా జూన్‌ 27న రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ఉత్సవాలు నిర్భహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన 11 ఏండ్ల కాలంలో వికలాంగులను అన్ని రంగాల్లో మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల చట్టాల అమలు పర్యవేక్షణలో నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్‌ ట్రస్ట్‌, నేషనల్‌ పాలసీ, 2016 ఆర్పీడీ చట్టాలను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌పరం చేసి వికలాంగుల రిజర్వేషన్లను ఎత్తివేయాలని కేంద్రం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. గత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని జీవో విడుదల చేసిందనీ, డాన్ని ఎందుకు అమలు చెయడం లేదని ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో వికలాంగుల సంక్షేమ శాఖ నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. పెన్షన్‌ రూ.6,000లకు పెంచకుండా వికలాంగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం వికలాంగులకు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు.
సామూహిక ప్రాంతాలను అవరోధ రహితంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన రాష్ట్రంలో అమలు కావడం లేదని తప్పుపట్టారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వికలాంగుల సమాఖ్యలను పునరుద్దరణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు టి.వరమ్మ, కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశప్ప, యశోద, అరిఫా, మధుబాబు, సహాయ కార్యదర్శులు రాజు, గంగాధర్‌, లింగన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు భుజంగారెడ్డి, నగేష్‌, రాములు, భాగ్యలక్ష్మి, నర్సిములు, రాధమ్మ, యాదయ్య, కవిత, మల్లేష్‌, ప్రియాంక, మేరీ, అనసూజా, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -