Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంతాగునీటి సమస్య తీర్చాలి

తాగునీటి సమస్య తీర్చాలి

- Advertisement -

– ఖాళీ బిందెలతో రహదారిపై ప్రజల నిరసన
నవతెలంగాణ-నిజాంసాగర్‌/గాంధారి

తాగునీటి సమస్యను పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్‌ మండల కేంద్రంలో బుడగ జంగాల కాలనీ వాసులు డిమాండ్‌ చేశారు. వారం రోజులుగా తాగునీటి ఇబ్బందులు తలెత్తడంతో కాలనీవాసులు శనివారం బోధన్‌ హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైటాయించి నిరసన తెలిపారు. వారం రోజులుగా కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనతో రోడ్డుపై ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న నిజాంసాగర్‌ ఎస్‌ఐ శివకుమార్‌ అక్కడికి చేరుకొని మహిళలను సముదాయించారు. గ్రామ పంచాయతీ అధికారులతో మాట్లాడి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీనివ్వడంతో వారు ఆందోళన విరమించారు.
గాంధారి మండలం బ్రాహ్మణపల్లిలో..
గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లిలో కూడా తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామపంచాయతీ ముందు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. పది రోజులుగా గ్రామంలో తాగునీరు రావడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad