Wednesday, January 7, 2026
E-PAPER
Homeజాతీయంభోగాపురంలో ల్యాండైన తొలి విమానం

భోగాపురంలో ల్యాండైన తొలి విమానం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఇవాళ‌ ఉదయం 10.15 గంటల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ ఇక్కడి రన్‌వేపై దిగింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్ తదితరులు ప్రయాణించారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు పనులు ఇప్పటికే 96 శాతం పూర్తయినట్లు నిర్మాణ సంస్థ జీఎంఆర్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని జూన్ 26న అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ ప్రాంతం నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -