- Advertisement -
నవతెలంగాణ – భీంగల్ :
మండలం ప్రత్యేక అధికారి డీపీవో శ్రీనివాస రావు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ పనులు, సీజనల్ వ్యాధులు, వనమహోత్సవము పలు అంశాలపై అధికారులతో సమీక్షించి ఎప్పటికప్పుడు పనులు వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, ఎంపిఓ జావిద్, మెడికల్ ఆఫీసర్ అజయ్, ఏపీఓ నరసయ్య, ఆర్టికల్చర్ అధికారి, AE హౌసింగ్, AEO, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -