ప్రుడెన్స్ హాస్పిటల్ ఎంబిబిఎస్, ఎండి జనరల్ ఫిజీషియన్, క్రిటికల్ కీర్ అండ్ డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ జక్కా రవి
నవతెలంగాణ – కంఠేశ్వర్ : వైద్య వృత్తిని ఎంచుకోవడం అంటే ప్రజలకు అండగా ఉంటామని అర్ధ ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తాం. కరోనా కష్టకాలంలోనూ ఎదురునిలిచి పోరాడిన ఘనత వైద్యులకే దక్కింది. ప్రజల ఆరోగ్య రక్షణీ వైద్యు ధ్యేయం అని ప్రుడెన్స్ హాస్పిటల్ ఎంబిబిఎస్, ఎండి జనరల్ ఫిజీషియన్ , క్రిటికల్ కీర్ అండ్ డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ జక్కా రవి అన్నారు. సమాజంలో వైద్యులను దైవంగా భావిస్తారు. అలాంటి వృత్తిలో ఉంటూ నిత్యం ప్రజల ప్రాణాలకు కాపాడుతున్న వైద్యుల చేస్తున్న సేవలు మరవలేనివి.
వారికి ప్రజలంతా సహకరించి నైతిక మద్దతు అందించాలి.ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు అంకింత భావంతో పనిచేస్తారు. రోగులకు శ్రేయస్సును వైద్యులు కోరుకుంటారు. నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు ముందుంటారు. వారి అసుపత్రికి వచ్చిన రోగిణి చికిత్స అందించి ఆరోగ్యవంతులగా తీర్చిదిద్దేవరకు వైద్యులు అందించే సేవలు అమూల్యమైనవి. నేడు అంతర్జాతీయ డాక్టర్స్ డే ను పురస్కరించుకొని వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజల ఆరోగ్య రక్షణే వైద్యుల ధ్యేయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES