Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి

సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి

- Advertisement -

అదనపు కలెక్టర్ అంకిత్
అధికారులతో సమన్వయ సమావేశం
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ కూడా డెంగీ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు వంటి వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా డెంగీ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. పారిశుధ్య పనులు పక్కాగా జరిగేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, దోమల నివారణకు అన్ని నివాస ప్రాంతాలలో ఫాగింగ్ చేయించాలని, నిలువ నీరు ఉన్న చోట, మురుగు కాలువలలో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. రోజువారీగా పీ.హెచ్.సీ ల నుండి సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసుల నమోదు వివరాలను తెప్పించుకుని, ఎక్కడైనా డెంగీ కేసులు నమోదైతే చుట్టుపక్కల అన్ని నివాస గృహాల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దోమల నివారణ మందులను గ్రామపంచాయితీలలో అందుబాటులో ఉంచుకోవాలని, వారానికి కనీసం రెండు పర్యాయాలు తప్పనిసరిగా పిచికారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న దృష్ట్యా అన్ని పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ బడులలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని, పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలన్నారు. 

రానున్న రోజులలో సీజనల్ వ్యాధులు మరింతగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున అప్రమత్తతో కూడిన చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ఎక్కడ కూడా తాగునీరు కలుషితం కాకుండా నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అన్ని నివాస గృహాలు, సంస్థలలో వారంలో రెండు రోజులు డ్రై డే నిర్వహించేలా చూడాలని, నిలువ నీటిని ఖాళీ చేయించి, దోమలు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నివాస గృహాలు, పరిసరాలలో చెత్తా చెదారం పేరుకుపోకుండా రోజువారీగా శుభ్రం చేయించాలని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నిర్ధారణ కోసం ప్రజలు రాపిడ్ టెస్టులు చేయించుకునేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ 9390653962 ను సంప్రదించవచ్చని తెలిపారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -