- Advertisement -
అమరావతి : గోదావరి పుష్కరాలు -2027 జూన్ 26నుంచి జూలై 7వరకు (12రోజులు) జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ(ఎండోమెంట్స్) శాఖ జీఓ ఆర్టి నెంబరు 1575ను శుక్రవారం విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్ధాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణప్రసాద్ అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. పుష్కరాల తేదీలను అన్ని శాఖలు, దేవస్థానాలు, జిల్లా యంత్రాంగం పరిగణలోకి తీసుకుని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
- Advertisement -



