మానసిక రోగుల పట్ల మరింత శ్రద్ధ పెట్టాలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మానసిక రోగుల పూర్తి సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. ఇతరులకు భిన్నంగా సొంతంగా తమ పనులు తాము చేసుకోలేని తీవ్రమైన మానసిక వైకల్యం కలిగిన వారిని కుటుంబాల్లో కొనసాగించలేక దీర్ఘకాలంపాటు ఆస్పత్రుల్లో చికిత్స కోసం ఉంచుతుంటారు. ఈ నేపథ్యంలో 2017లో కేంద్ర ప్రభుత్వం మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం మానసిక వైకల్యం కలిగిన వారి ఆహారం, వసతి, ఆరోగ్య సంరక్షణ తదితర బాధ్యతలన్ని ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాలో వీరి కోసం ప్రత్యేకంగా ఒక సెంటర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకపోవడంతో హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంపైనే ఎక్కువగా ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తున్నది.
మానసిక వైకల్యం ఉన్న రోగులు కావడంతో వీరి పట్ల సానుభూతి కలిగిన సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించాల్సి ఉంటుంది. వీరికందిస్తున్న సేవలను నిరంతరం పర్యవేక్షించే విషయంలో తగినంత నిఘా కొరవడినట్టు మానసిక ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనతో స్పష్టమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తున్నా… వాటిని సరిగ్గా వినియోగించాల్సిన విధుల్లో ఉన్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా తేల్చారు. ఉన్నతాధికారులు నిరంతరం నిఘా పెడితే తప్ప ఇలాంటి ఘటనలు ఫుల్స్టాప్ పడే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ఒకరిద్దరి తొలగింపుతోనే పరిస్థితి పూర్తిగా చక్కబడదనీ, పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. 2017 మెంటల్ హెల్త్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వానిదే బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES