నవతెలంగాణ-పటాన్చెరు
హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐఐడీ) ప్రాంతీయ చాప్టర్ మేనేజింగ్ కమిటీ సభ్యులు.. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్కిటెక్చర్ విద్యా వ్యవస్థ, అక్కడి స్థితిగతులు, కీలకమైన మౌలిక సదుపాయాలను కమిటీ సమీక్షించింది. విద్యార్ధులతో కమిటీ సభ్యులు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ వర్క్ ఎగ్జిబిషన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆవిష్కరణ, డిజైన్ సున్నితత్వం, విద్యాపరమైన కఠోరతను ప్రతిబింబించే విద్యా ప్రాజెక్టుల ప్రత్యేక ప్రదర్శనను కూడా కమిటీ సభ్యులు వీక్షించారు. ఐఐఐడీ ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ఆర్. బందన్ కుమార్ మిశ్రా ప్రసంగించారు. ఆర్కిటెక్చర్ విద్యలో రాణించడానికి సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటించడంతోపాటు ఐఐఐడీ సహకారం ప్రాముఖ్యతనూ ప్రస్తావించారు. అర్థవంతమైన విద్య, వృత్తిపరమైన సహకారాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్శనను అసిస్టెంట్ ప్రొఫెసర్ స్నిగ్ధ రాయ్ సమన్వయం చేశారు.
‘గీతం’ను సందర్శించిన హైదరాబాద్ ఐఐఐడీ మేనేజింగ్ కమిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



