- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రానికి చెందిన జర్నలిస్టు సత్యనారాయణ ఇటీవల కాలంలో మరణించిన విషయం తెలిసిందే. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో కార్యదర్శి వెంకటేశ్వర్లను కలిసి మరణించిన సత్యనారాయణ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా చూడాలని కోరినట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు శ్రీనివాస్, లతీఫ్, శంకర్, శ్రీకాంత్, రామేశ్వరరావు, తదితరులు ఉన్నారు.
- Advertisement -


