ఓటరు తుది జాబితా విడుదల
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామాల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మండల అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. మండలంలో మొత్తం 15 గ్రామపచాయితీల్లో 128 వార్డులు, ఏడూ ఎంపిటిసిలు ఉన్నాయి. 15 పంచాయతీలు, 46పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను ఆయా గ్రామపచాయితీల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాను ప్రదర్షించారు. మండలంలో మొత్తం ఓటర్లు 22,446 ఉండగా అందులో మహిళ ఓటర్లు 11,479, పురుషుల ఓటర్లు 10,967 ఉండగా..ఇందులో మహిళ ఓటర్లే 512 అధికంగా ఉన్నాయి. గతంతో పోలిస్తే సుమారుగా వెయ్యి ఓటర్లు పెరిగాయి.
గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా వివరాలు..
1.అడ్వాలపల్లి…. వార్డులు 8… ఓటర్లు…..676.
2.ఆన్ సాన్ పల్లి…. .వార్డులు…8.. ఓటర్లు….1082.
3.చిన్నతూండ్ల…. వార్డులు…8…. ఓటర్లు….688.
4.దుబ్బపేట…. వార్డులు….4….ఓటర్లు….211.
5.ఎడ్లపల్లి…. వార్డులు…8… ఓటర్లు…12,22.
6.ఇప్పలపల్లి.. వార్డులు…. ఓటర్లు…519.
7.కొండంపేట… వార్డులు…8… ఓటర్లు…694.
8.కొయ్యుర్… వార్డులు..8… ఓటర్లు…967.
9.మల్లంపల్లి… వార్డులు…4… ఓటర్లు…186.
10.మల్లారం… వార్డులు…10….ఓటర్లు…2,362.
11.నాచారం…. వార్డులు…8.. ఓటర్లు….882.
12.పెద్దతూండ్ల…. వార్డులు…10…ఓటర్లు….2,401.
13.రుద్రారం…. వార్డులు…12….ఓటర్లు…2,497.
14. తాడిచెర్ల…. వార్డులు…14… ఓటర్లు…6,537.
15. వళ్లెంకుంట… వార్డులు…10… ఓటర్లు….1,522