- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ప్యూరోపాల్ క్రియేషన్స్ & ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.2 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ట్రైనింగ్ పూర్తయ్యాక నియామక పత్రాలు ఇస్తామని, 2 నెలలు ట్రైనింగ్ పేరుతో కాలయాపన చేసి బోర్డు తిప్పేసింది. దీంతో 200 మంది బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
- Advertisement -