Friday, December 12, 2025
E-PAPER
Homeజిల్లాలులింగంపల్లి గురుకుల విద్యార్థుల కిడ్నాప్ కథ సుఖాంతం

లింగంపల్లి గురుకుల విద్యార్థుల కిడ్నాప్ కథ సుఖాంతం

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అది కిడ్నాప్ కాదని కేవలం పిల్లలు అల్లిన కట్టుకథగా విద్యార్థులు ఒప్పుకున్నారు. వివరాల లోకి వెళితే.. పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న రాకేష్, సిద్దు ఇద్దరు విద్యార్థులు కారులో వచ్చి తమను ఎవరో కిడ్నాప్ చేశారని స్కూల్ కు దూరంగా ఉన్న పొలాల వద్ద అచేతన స్థితిలో కనిపించారు. ఇది గమనించిన గ్రామస్తులు మొదట జహీరాబాద్ ఆస్పత్రికి, తర్వాత సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. లోతుగా విచారించిన ఉపాధ్యాయ బృందం ఇతర మండల శాఖ అధికారులు చివరకు పిల్లలను ఎవరు కిడ్నాప్ చేయలేదని, అది పిల్లలు ఆడిన కిడ్నాప్ కథగా రుజువు చేసుకున్నారు.

ఇందుకు సంబంధించి మండల పరిషత్ అభివృద్ధి అధికారి హరినందన్ రావు పాఠశాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఏం జరిగిందో వాస్తవ అవాస్తవాలను వివరించమని విద్యార్థులకు కోరారున. అప్పడు విద్యార్థులు అసలు విషయం బయట పెట్టారు. తమతో స్నేహంగా ఎవరు ఉండడం లేదనే కారణంతో ఇలాంటి కిడ్నాప్ డ్రామా ఆడినట్టు విద్యార్థులు అధికారుల ముందు ఒప్పుకున్నారు. సినిమాలు, సీరియల్ ప్రభావం కారణంగానే విద్యార్థులు ఇలాంటి చర్యలకు పాల్పడతారని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మండల పరిషత్ అభివృద్ధి అధికారి హరి నందనరావు, ప్రిన్సిపాల్ సురభి చైతన్యతో కలిసి పిల్లల్లో మానసిక ధైర్యాన్ని నింపి ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని సర్ది చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -