Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమ్మెను విజయవంతం చేయాలి..

సమ్మెను విజయవంతం చేయాలి..

- Advertisement -

సిఐటియు జిల్లా అధ్యక్షులు: దాసరి పాండు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : కేంద్ర  ప్రభుత్వం ఆలమిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై జరుగుతున్న సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని సమ్మెను  విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు  కోరారు. సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని మోడీ విధానాలను మోడీ కార్పొరేట్ పెట్టుబడుదారి విధానాలను ఎండగట్టాలని  అన్నారు. గురువారం  సిఐటియు ఆధ్వర్యంలో   భువనగిరి మండల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ దారి విధానాల అవలంబిస్తూ కార్మిక వర్గాన్ని అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు దాసోహం చేయిస్తున్నదని అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటూ శ్రమదోపిడి చేస్తున్నదని సుప్రీంకోర్టు చెప్పిన తీరు ప్రకారంగా కనీస వేతనాలు, కార్మిక చట్టాలు అమలు చేయడం లేదని కీళ్ల తరబడిగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ బానిసలుగా పని చేసుకుంటున్నారని అన్నారు. బ్రిటిష్ వారి కాలంలో ఎలాంటి హక్కులు లేకుండా కార్మికులతో పని చేయించుకునే విధంగానే దేశ ప్రధాని మోడీ  బ్రిటిష్ కాలాన్ని గుర్తించే విధంగా చేస్తున్నాడని కార్మికుల హక్కుల రక్షణకై జరుగుతున్న దేశభక్తి సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మోడీ విధానాలను వ్యతిరేకించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు స్వామి, శంకర్, ఐలయ్య, ఎల్లేష్,  బుజ్జమ్మ, కిష్టమ్మ, లక్ష్మమ్మ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -