- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సర్వే ఆఫ్ ఇండియా జియోడెటిక్ అసెట్ రిజిస్టర్స్, జియోడెటిక్ అసెట్ మ్యాప్ ను విడుదల చేసింది. శుక్రవారం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు దీనికి సంబంధించిన కాఫీ టేబుల్ బుక్ను అందజేసింది. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం- అదే విధంగా దేశ ప్రగతిలో ప్రతి ప్రాంతం పాత్రను వివరిస్తూ మ్యాపింగ్ చేశారు. కాఫీ టేబుల్ బుక్ కేవలం దేశ ప్రగతిని, శాస్త్ర ప్రగతిని వివరించడమే కాకుండా డిజిటల్ శకంలో ఆశావహులకు నచ్చేలా రూపొందించారు. సీఎస్ను కలిసిన వారిలో సర్వే ఆఫ్ ఇండియా ఏపీ, తెలంగాణ డైరెక్టర్ బి.సి.పరిడా, ఆఫీసర్ సర్వేయర్ పి.నిత్యానందం ఉన్నారు.
- Advertisement -



