- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్: మండలంలోని బుదవారం నుంచి కురిసిన వర్షానికి చెరువులు నిండు కుండల నిండుకున్నాయి. బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి గురువారం ఉదయం 8:30 గంటల వరకు మాక్లూర్ మండలంలో నమోదైన సగటు వర్షపాతం 66.1 మిమి కురిషినట్లు ఏఎస్ఓ భోపాల్ తెలిపారు. మాక్లూర్ ( మనువల్) 62.8 మిని, లక్మాపూర్ (ఏడబ్ల్యూ ఎస్) 55.0 మిమీ, మదన్ పల్లి (ఏడబ్ల్యూ ఎస్)80.5 మీమీ వర్షపాతం కురిసినట్లు తెలిపారు. మండల కేంద్రంలోని చింతల చెరువు అలుగు పొంగి పొర్లుతుంది. మాక్లూర్, కృష్ణ నగర్ గ్రామాల మధ్య రోడ్డులో గల అప్పి రోడ్డుపై మంచు పరడం వల్ల రెండు గ్రామాలకు రాకపోకలు ఇబ్బందిగా మారింది. అమ్రాద్ తండాకు వెళ్లే రోడ్డు లో గల రైల్యే బిడ్జి కింది వర్షపు నీరు నిలిచాయి.
- Advertisement -