నవతెలంగాణ – రెంజల్ : పొగాకు రైతుల కష్టాలు పగవానికి కూడా రావద్దని రైతులు తమ ఆవేదనన వ్యక్తం చేస్తున్నారు. గత పది సంవత్సరాల నుంచి పొగాకు రైతులకు ఎలాంటి అవస్థలు ఉండేవి కావని, పొగాకు యాజమాన్యాలు ముందుగానే రైతుల నుంచి బాండ్ రూపంలో కొనుగోలు చేస్తూ, రైతులకు ప్రోత్సాహక బహుమతులు సైతం అందించేవారు. గత సంవత్సరం పొగాకు రైతులకు వివిధ కంపెనీలు విచ్చేసి విచ్చలవిడిగా ధరలు నిర్వహిస్తూ కొనుగోలు చేశారు. ఈ విషయం గ్రహించిన వ్యవసాయ కూలీలు సైతం కౌలుకు భూములను తీసుకొని పొగాకు పంటలు పండించారు. భూములకు కవులు ఇవ్వడంతో పాటు, పంట పెట్టుబడులు రెట్టింపు కావడంతో తమ కష్టాలు గట్టున పడే అవకాశం ఉందని రైతులు పంటలు పండించగా ప్రస్తుతం కంపెనీ యాజమాన్యాలు ఒక్కసారిగా రాకపోవడంతో వారు పండించిన పంట విక్రయించడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది.
ఒకవైపు నా వాతావరణ పరిస్థితులు, మరోవైపు కొనుగోలు చేసే కంపెనీలు రాకపోవడంతో వారి పరిస్థితి కూడితిలో పడ్డ ఎలుకల తయారైంది. జీఎస్టీ, టిడిపి, తదితర కంపెనీల వారు పొగాకు నాణ్యతను బట్టి రూ.12 నుంచి రూ.13 వేల లోపు కొనుగోలు చేశారు. కానీ గత పది సంవత్సరాల నుంచి పొగాకు పంట పండించిన రైతుల వద్ద మాత్రమే వారు కొనుగోలు చేయడంతో, నూతనంగా పొగాకు పంట పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతులు ఆయా కంపెనీ యాజమాన్యాలతో చర్చించి తాము పండించిన పంటను ఎంతో కంతకు కొనుగోలు చేయాలని పట్టుబట్టడంతో వారు పొగాకు నాణ్యతను బట్టి ప్రధాన రోడ్లపైనే క్రయవిక్రయాలు ప్రారంభించారు. పొగాకు నాణ్యతను బట్టి రూ.3000 నుంచి రూ.4 వేల మధ్యలో ధర నిర్ణయించి కొనుగోలు చేశారు. అయితే రైతులు చేసేది లేక విక్రయించడానికి ఆసక్తి చూపుతున్నారు. నూతనంగా పొగాకు పండించిన రైతుల పరిస్థితి దయానియంగా మారింది. ఈ ఏడాది మహారాష్ట్రలో అధిక సంఖ్యలో పొగాకు పంటను పండించడంతో కంపెనీ యాజమాన్యాలు తమకు నచ్చిన ధరకే కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతులకు తీవ్రంగా నష్టం వాటిలిందని వారు తెలిపారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన రైతులు వారం పది రోజుల వరకు పడిగపులు పడుతూ పసుపు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడు బిలోలి, సాటాపూర్ గ్రామాలలోని హైవేపై రైతుల పొగాకు కొనుగోలను చేపట్టడంతో వారు ట్రాక్టర్ల పై ఘట్టాలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. వర్షం పడిందంటే పొగాకు పూర్తిగా పనికి రాకుండా పోతుందన్న ఉద్దేశంతో పొగాకు యాజమాన్యం నిర్ణయించిన ధరకే వాటిని విక్రయించి తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.