దీనిపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చేసే పోరాటంలో ఎంఐఎం అండగా ఉంటుంది
ఎంఐఎం తెలంగాణ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ
నవతెలంగాణ – ముషీరాబాద్
రాజ్యాంగ మూల సూత్రాలకు వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఇటీవల కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని, దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంఐఎం తెలంగాణ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఈ చట్టం రద్దు కోసం రాజకీయాలకతీతంగా ముస్లిం సంఘాలన్నీ ఐకమత్యంగా పోరాడి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్బ రుద్దీన్ మాట్లాడుతూ.. ఈ పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మత పెద్దలు ఈ ఉద్యమాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు. దీనికి ఎంఐఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని, ముస్లిం సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు సంపూర్ణ మద్దతివ్వాలని కోరారు. బోర్డు అధ్యక్షులు మౌలానా సయివుల్లా రహమాని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరి స్తున్నదన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, వక్ఫ్బోర్డు సవరణ చట్టం వంటి నల్ల చట్టాలు తీసుకొచ్చి ముస్లింల వ్యక్తిగత హక్కులు కాలరాసే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులు, ఆది వాసీలు, ముస్లిం మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని, ఆ వర్గాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ మత ఘర్షణలకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ మైనార్టీ బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, వీటిపై అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో ఎంఐఎం ఎమ్మెల్యేలు అహ్మద్ బాలాలా జాఫర్ హుస్సేన్ మేరాజ్, మాజీద్ హుస్సేన్, కౌసర్ మోయినుద్దీన్, మహ్మద్ మౌబిబల, ముస్లిం సంఘాల నాయకులు డాక్టర్ సయ్యద్ అలీ హుస్సేన్, సయ్యద్ మసూద్ హుస్సేన్, డాక్టర్ సయ్యద్ నిస్సార్ హుస్సేన్, డాక్టర్ మహ్మద్ ముస్తాక్, జెలీసా సుల్తానా, అప్స, జఫార్ మసూద్, మౌలానా షఫీక్ ఆలం, మౌలానా అక్బర్ నిజాముద్దీన్, బోర్డు ప్రతినిధులు, వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు.
వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES