- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్లోని టోలిచౌకి పరిధిలో జరిగిన చోరీ కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఎస్ఎఫ్ కాలనీకి చెందిన షేక్ నజీర్ కెనడాలో ఉంటుండగా, అతని భార్య ఫర్హీన్బేగం మలక్పేటలోని తల్లి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత బీరువాలో ఉన్న నగలు మాయమయ్యాయి. 4.5 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు, రూ.5వేల నగదు చోరీ అయినట్లు బాధితురాలు పోలీసులకు చెప్పింది. అయితే సొంత చెల్లెలు రుహీనా బేగం, ఆమె భర్త మహ్మద్ రజాక్ కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
- Advertisement -



