Sunday, June 1, 2025
E-PAPER
HomeUncategorizedమాస్‌ సినిమాగా 'తెరచాప'

మాస్‌ సినిమాగా ‘తెరచాప’

- Advertisement -

అనన్య క్రియేషన్స్‌ బ్యానర్‌ పై కైలాష్‌ దుర్గం నిర్మిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్‌ జార్జ్‌ రచనా దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్‌ రాజ్‌ శంకరపు, పూజ సుహాసిని, స్రీలు, రాజీవ్‌ కనకాల, పథ్వీరాజ్‌, జగదీష్‌ ప్రతాప్‌ బండారి, రాఖి, నాగ మహేష్‌, ఫిష్‌ వెంకట్‌, అశోక్‌, నాగి, అప్పారావు, రైసింగ్‌ రాజు, రాజేష్‌ భూపతి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. తాజాగా ప్రసాద్‌ ల్యాబ్‌లో హీరో కార్తీక్‌ రత్నం, ‘హరికథ’ దర్శకుడు మ్యాగీ చేతుల మీదగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్బంగా 30 ఇయర్స్‌ పృథ్వీ మాట్లాడుతూ, ‘ఇదొక అద్భుతమైన సినిమా. నవీన్‌ని చూస్తుంటే తమిళ హీరో విక్రమ్‌ గుర్తొస్తున్నాడు. ఆయన సినిమా కోసం ఎంత కష్టపడతాడో నవీన్‌ కూడా అంతే కష్టపడుతున్నాడు. కచ్చితంగా ఇతను మన టాలీవుడ్‌కి విక్రమ్‌ లాంటి హీరో అవుతాడు’ అని అన్నారు. ‘ఈ సినిమాని మంచి మాస్‌ సినిమాగా తీసాం. అలాగే ఇందులో కొంచెం తమిళ నేపథ్యం కూడా ఉంటుంది. అందరి సహకారంతో మంచి అవుట్‌ పుట్‌ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని డైరెక్టర్‌ జోయెల్‌ జార్జ్‌ అన్నారు. ప్రొడ్యూసర్‌ కైలాష్‌ దుర్గం మాట్లాడుతూ, ‘నిర్మాతగా సినిమా రంగంలో ఇదే నా తొలి చిత్రం. ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ సినిమాతో హిట్‌ కొడతాం’ అని అన్నారు. ‘నాపై నమ్మకంతో ఈ సినిమా మీద 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది. చాలా మంచి అవుట్‌పుట్‌ వచ్చింది. తప్పకుండా మీకు నచ్చుతుంది’ అని హీరో నవీన్‌ చెప్పారు. నటుడు కార్తీక్‌ రత్నం మాట్లాడుతూ, ‘టీజర్‌ చాలా బాగుంది. నవీన్‌ రాజ్‌కు నేను ఎంతో సపోర్ట్‌గా నిలుస్తాను. దర్శకుడి మేకింగ్‌, అలాగే బిజిఎం, సంగీతం చాలా అద్భుతంగా ఉన్నాయి’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -