- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం పలు అంశాలు చర్చకు రానున్నాయి. సభ మొదలైన తర్వాత ముందుగా ప్రశ్నోత్తరాల నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ(హిల్ట్ పాలసీ) చర్చ జరగనుంది. లంచ్ అనంతరం తెలంగాణ రైజింగ్ 2047 పై సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడనున్నారు. ఈ మేరకు శాసనసభ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేసారు.
- Advertisement -



