– సదాశివపేట మండలంలో 88.96% పోలింగ్
– శాంతియుతంగా 30 గ్రామ పంచాయతీలలో తొలి విడత ఎన్నికలు
నవతెలంగాణ-సదాశివపేట
సదాశివపేట మండల పరిధిలో గురువారం జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 30 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగగా, ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైనది. మండలంలో మొత్తం 41,016 మంది ఓటర్లు ఉండగా, 88.96% శాతం పోలింగ్ నమోదైంది.
ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల వివరాలు
పెద్దాపూర్ : శ్రీరంగాని మనీషా బాలరాజ్ గౌడ్
నాగ్సన్ పల్లి : రవికుమార్
నందికండి : రాచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డి
గొల్లగూడెం : మునిగే సుజాత నవీన్
రేజింతల్ : గడిల ఆశీరెడ్డి
కంబాలపల్లి : ఇందూరి భారతమ్మ బాబు
మద్దికుంట : దేవులా నాయక్
తంగడపల్లి : కిందొడ్ల శేఖర్
ఆరూర్ : నాయికోటి లావణ్య మధు
కోనాపూర్ : చిరంజీ అనిల్ రెడ్డి
నాగులపల్లి : నాగులపల్లి విజయలక్ష్మి శివానంద్ గౌడ్
అంకెనపల్లి : లక్ష్మణ్
ఎల్లారం : మల్లేశం
చందాపూర్ : మల్లికార్జున్ పాటిల్
ఆత్మకూరు : వడ్ల నికిత బింబాదర్ చారి
బొబ్బిలి : సవ్వ ఉమా దేవి మాణిక్ రెడ్డి
ఏటిగడ్డ సంఘం : అమృతమ్మ
మాలపాడు : సంతోష్ గౌడ్
నిజాంపూర్ : జోరిగల తులసి సత్యనారాయణ
పొట్టిపల్లి : గొల్ల రాములమ్మ లక్ష్మయ్య
వెల్టూరు : తొంట కృష్ణ
ముబారక్పూర్ (A) : సుల్తాన్పూర్ నవీన్ యాదవ్
ముబారక్పూర్ (B) : శంకర్
ఇశ్రీతాబాద్ : బలరాం అనిత శ్రీనివాస్
ఎనికెపల్లి: దుర్గప్రసాద్
వెంకటాపురం : ఒగ్గు శ్రీనివాస్
మాచిరెడ్డిపల్లి : కలాలి మోహన్ గౌడ్
కోల్కూర్ : ముత్తంగి ఉమారాణి
సూరారం : మద్దుమ్ పటేల్
మెలిగిరిపేట : ఏకగ్రీవ సర్పంచ్ షాబుద్దీన్
పోలింగ్ ప్రశాంతంగా సాగడం, ఓటర్ల శాతం అధికంగా ఉండటం గ్రామస్థులలోని ప్రజాస్వామ్య చైతన్యాన్ని స్పష్టంగా ప్రతిబింబించిందని తెలిపారు.



