Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeసోపతిఆలోచనలే మిమ్మల్ని నిర్దేశిస్తాయి

ఆలోచనలే మిమ్మల్ని నిర్దేశిస్తాయి

- Advertisement -

మీకు వచ్చే ఆలోచనలే మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. అంటే మీ జీవిత కాలంలో మీరు నేర్చుకున్న పాఠాలు, విలువలు, మీరు బాల్యంలో తీసుకున్న ‘శిక్షణ’ మొదలైనవన్ని మీ జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వెళతాయి. ఒకవేళ మీరు అలాంటి స్థానంలో లేరు అంటే అది మీ అభ్యాసన లోపం కాదు. మీరు శిక్షణను సరిగ్గా ఉపయోగించుకోలేదని అర్ధం. మీరు ఎక్కడ విఫలం అయ్యారో ఈ చిన్న కథను చదవండి.

ఓ జాలరి నివసించే ఊరిలో ఒక కోటీశ్వరుడు కూడా ఉండేవాడు. జాలరి ప్రతిరోజు సముద్రంలో వేటకి వెళ్ళి వలకి చిక్కిన చేపలను అమ్ముకొని వచ్చిన డబ్బులతో పిల్లల్ని పోషించుకునేవాడు. అలాగే కోటీశ్వరుడు తన దగ్గర వున్న డబ్బు మీద నియంత్రణ లేకుండా విపరీతంగా ఖర్చుపెట్టి వున్నదంతా పోగొట్టుకొని జాలరి ఇంటి పక్కన వున్న ఓ ఇంట్లోకి మారుతాడు. ఆ పేదరికంలో వున్న జాలరితో పాటు ఇతను కూడా రోజు సముద్రంలో చేపల వేటకి వెళ్ళేవాడు. పేదజాలరి వలకి చిక్కిన చేపల్ని తన దినచర్యలో భాగంగా అమ్ముకొని కాలం వెళ్ళదీసేవాడు. అతని ఇంటి పక్కన వున్న మరొక జాలరి మాత్రం తన వలకు చిక్కిన చేపల్ని అమ్ముకొని వాటి ద్వారా వచ్చిన డబ్బుల్ని తన కుటుంబ అవసరాలుపోను మిగిలినవి పొదుపు చేసుకునేవాడు. ఇలా రోజులు గడుస్తున్న కొద్ది పేదజాలరి పేదవాడిలాగే ఉండిపోయాడు. పేదజాలరి ఇంటి పక్కకు మారిన మరొక జాలరి మాత్రం తను పోగేసుకున్న డబ్బులతో చిన్న చిన్న పడవలను, మరబోట్లను కొని ఇంకా ఎక్కువగా చేపలు పట్టి కోట్లకు అధిపతిగా మారుతాడు. చూశారా పేదరికంలో వున్న జాలరి పేదవాడిగానే మిగిలిపోతే కోటీశ్వరుడిగా వుండి డబ్బు మీద నియంత్రణలేక పేదవాడిగా మారి జాలరి ఇంటి పక్కకు వెళ్ళి మళ్ళీ కోటీశ్వరుడిగా మారతాడు. ఇక్కడ కోటీశ్వరుడు తన స్వయం కతాపరాధం వల్ల పేదవాడిగా మారి మళ్ళీ తను సంపాదించిన చిన్న చిన్న మొత్తాలను దాచుకొని వ్యాపారాన్ని విస్తతం చేసి రెండోసారి మళ్ళీ ధనవంతుడయ్యాడు. మరి పేద జాలరి మాత్రం అలా ఆలోచించలేకపోయాడు. అలా మీరు కూడా పేదజాలరి లాగే ఆలోచించాలనుకుంటే అది మీ ఇష్టం. కానీ అలాంటి జీవితంలో ఎలాంటి మార్పూ, అనుభూతి ఉండదు. రోజులు గడుస్తాయి తప్ప. మీరు మీ నుండి వచ్చిన పిల్లలూ పేదరికంలోనే మగ్గుతారా? మీరు ఎలా బతికారన్నది ముఖ్యం కాదు. కానీ మీ తర్వాతి తరం వారు కూడా అలాగే బతకాలని కోరుకోవడం అవివేకపు ఆలోచనే. ఎందుకంటే ఓ బిచ్చగాడి కుమారుడు బిచ్చగాడిగానే జీవితాన్ని ప్రారంభించాలని కోరుకోడు. మరి మీరెలా ఆలోచిసున్నారనేది మీ ప్రణాళికలపై, మీ ఆలోచనలపై ఆధారపడి వుంటుంది. అందుకే మీ జీవితంలో నిస్సారమైన రోజుల్ని పక్కకుపెట్టి ఆలోచనలకు వైవిధ్యాన్ని జోడిస్తే మీ తర్వాత తరం వారు ఉన్నతంగా బతకటానికి మార్గం వేసినవారవుతారు.
ఒక ప్రయోగంలో సంచలనమైన నిజాలు బయటపడ్డాయి. కొద్దిమంది చిన్న పిల్లల్ని విష సర్పాలున్న గదిలోకి పంపుతారు. ఆ పిల్లల తల్లిదండ్రులందరూ భయపడతారు. కానీ పిల్లలు భయపడలేదు. పైగా వాటితో ఆడుకున్నారు కూడా. వాటిని బొమ్మలుగా భావించి సరదాగా కాలక్షేపం చేశారు. ఈ ప్రయోగం ద్వారా మనస్తత్వవేత్తలు తెల్సుకున్నదేమిటంటే మనం పుట్టింది రెండే రెండు భయాలతో. అందులో ఒకటి పెద్ద పెద్ద శబ్దాలతో వచ్చే భయం, రెండోది ఎత్తుగా వున్న ప్రదేశాలు. ఇవే మనల్ని సహజంగా భయపెడ్తాయి. ఇక మిగిలిన భయాలన్ని మనం నేర్చుకున్నవే. అందులో నిబంధనలు, (జశీఅసఱ్‌ఱశీఅర) రెండోది కార్యక్రమాల (ూతీశీస్త్రతీaఎఎవర) ద్వారా వచ్చే భయాలు.
నిబంధనల ద్వారా వచ్చే భయం పాము కరుస్తుందని, పులి చంపుతుందని, నిప్పుకాలుతుందని. ఇవి మన పూర్వీకుల ద్వారా తెల్సుకున్నవి. రెండోది కార్యక్రమం ద్వారా వచ్చే భయం. ఇవి అసహజాలు, యుద్ధాలు, వరదలు, సునామీల వంటివాటి వల్ల వచ్చే ప్రమాదాలు. భయమనేది కేవలం మనం వ్యక్తం చేసే స్పందన (=వరజూశీఅరవ Aష్‌ఱశీఅ) చర్య మాత్రమే. అందుకే అందరూ ఒకే విషయానికి భయపడరు.
ఖీవaతీ శీట టaఱశ్రీబతీవ, ఖీవaతీ శీట jబసస్త్రవఎవఅ్‌
అసలు ఏదైనా పనిని ప్రారంభించాలంటే భయం. వాస్తవానికి జీవిత అనుభవాల్నించి చాలా నేర్చుకుంటాం. ఆ అనుభవాల్లోంచి వారసత్వంగా వచ్చిందే భయం. కాబట్టి భయం కూడా మన ఆలోచనల్లోంచి వచ్చేదే. అతిగా భయపడితే మనం ఏమీ సాధించలేం. పైగా ప్రతీచోట ఏదో జరుగుతుందనే భయం వెంటాడుతుంది కూడా. ఒకే పేరున్న ఇద్దరు వ్యక్తులు జనరల్‌ చెకప్‌ చేయించుకోవాలని హాస్పిటల్‌కి వెళ్తారు. డాక్టర్‌ వారిద్దరికీ రకరకాల పరీక్షలు చేసి ఆ ఇద్దరిలో ఒకరిని పిలిచి నీకు క్యాన్సర్‌ సోకింది, త్వరలో నువ్వు చనిపోతావ్‌. ఎలాంటి ఆలోచనలు చేయకుండా మిగిలిన సమయాన్ని ప్రశాంతంగా భార్యా పిల్లలతో గడపు అంటాడు. రెండో వ్యక్తిని పిలిచి మీకు చేసిన పరీక్షలు అన్నీ నార్మల్‌గానే వచ్చాయి. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో వున్నారని చెప్పి పంపిస్తాడు. వాస్తవంగా జరిగినదేమంటే డాక్టర్‌ వద్ద వున్న రిపోర్టులు తారుమారై ఆరోగ్యంగా వున్న వ్యక్తికి క్యాన్సర్‌ అని చెప్తాడు. క్యాన్సర్‌ తో వున్న వ్యక్తికి ఆరోగ్యంగా ఉన్నావని చెప్తాడు. చివరికి జరిగినదేమిటంటే ఆరోగ్యంగా వున్న వ్యక్తికి డాక్టర్‌ ఎప్పుడైతే క్యాన్సర్‌ అని చెప్పాడో ఆ క్షణం నుండే అతడిలో భయంతో నెగెటివ్‌ ఆలోచనలు మొదలయ్యాయి. అతడు ప్రతిరోజు భయంతోనే గడిపి వారం రోజుల్లోనే చనిపోతాడు. వాస్తవంగా క్యాన్సర్‌ వున్న వ్యక్తి డాక్టర్‌ ఆరోగ్యంగా వున్నావని ఎప్పుడైతే చెప్పాడో ఆ క్షణం నుండే అతడిలో ఆత్మ విశ్వాసం రెట్టింపుగా పనిచేసింది. అతడు ఇంకా జీవించే వున్నాడు. చూశారుగా… ఆలోచనలే మనల్ని ప్రతిక్షణం మార్గదర్శనం చేస్తాయి. అవి నెగెటివ్‌ ఆలోచనలైతే ఫలితం కూడా అలాగే వుంటుంది. పాజిటివ్‌ ఆలోచనలైతే వాటి ఫలితం ముందకు నడుపుతుంది. కాబట్టి స్వార్ధం, అసూయ, ఈర్ష్యా, భయం, కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, మొదలైనవన్నీ మనిషి సహజ ఉద్వేగాలు. వీటిని నియంత్రించుకున్నవారే గొప్పగా ఎదుగుతారు. కావున మంచి ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టినవాడే ఉన్నతుడు. మీరు అలాగే ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎవరికీ హాని చేమొద్దని ఆలోచిస్తున్నారంటే జీవితంలో విజయం సాధించడానికి అడుగులు వేస్తున్నారని గ్రహించాలి.
(నవతెలంగాణ దశమ వార్షికోత్సవం సందర్భంగా)

  • డా||మహ్మద్‌ హసన్‌,
    9908059234
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img