12 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల్లో ముగ్గురు నెల్లికుదురు మండల వాసులే
విద్యార్థులను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల లక్ష్యం
నవతెలంగాణ – నెల్లికుదురు
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమంలో నెల్లికుదురు మండలానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులకు ఘన సన్మానం జరిగినట్లు మండల విద్యాశాఖ అధికారి ఏ రాందాస్ తెలిపారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో జిల్లా మొత్తం 18 మండలాల నుండి 12 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేస్తే అందులో ముగ్గురు నెల్లికుదురు మండలానికి చెందిన ఉపాధ్యాయులే కావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సన్మాన పొందిన తండా హరీష్(జెడ్పిహెచ్ ఎస్ ఆలేరు),కుమారస్వామి(ఎంపీయూ పీఎస్ సీతారాంపురం), అజూమ్ సుల్తాన్(టి.జి.ఎం.ఎస్ నెల్లికుదురు) ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాస్థాయిలో ముగ్గురు ఉపాధ్యాయులకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES