- Advertisement -
దొంగిలించిన సామాను స్వాధీనం..
కోర్టు ముందు హాజరు పరిచిన పోలీసులు
నవతెలంగాణ – రామారెడ్డి
ఈనెల 19వ తేదీన మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన కంకణాల దిలీప్ ఇంట్లో, గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్, స్టావ్, బంట పాత్రలు, ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారు. దీంతో బాధితుల వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో నిందితులు ఉట్ల శ్రీనివాస్, షేక్ సలాం, రఫీ లను అరెస్టు చేసి, దొంగిలించిన సామాన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై లావణ్య తెలిపారు.
- Advertisement -