Friday, December 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు పటిష్ట భద్రత

మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు పటిష్ట భద్రత

- Advertisement -

– రాష్ట్ర డీజీపీ బి.శివధర్‌ రెడ్డి
– ఏర్పాట్లపై ఉప్పల్‌ స్టేడియంలో అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో

మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ బి.శివధర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈనెల 13న ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సితో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్‌కు తీసుకోవాల్సిన భద్రతాపరమైన, ఇతర ఏర్పాట్లపై రాచకొండ సుధీర్‌ బాబు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి డీజీపీ గురువారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ శాఖ, వాటర్‌ వర్క్స్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణకు చెందిన అధికారులతో పాటు మ్యాచ్‌ నిర్వాహకులు కూడా ఈ సమావేశానికి హాజరై ఏర్పాట్లను డీజీపీకి వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మ్యాచ్‌కు తరలివచ్చే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పటిష్టమైన చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా, ఫుట్‌బాల్‌ ప్రొఫెషనల్‌ క్రీడాకారుడు లియోనల్‌ మెస్సికి ఉన్న ప్రపంచవ్యాప్త ఇమేజ్‌ దృష్ట్యా, సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొంటున్నందున భద్రతాపరమైన ఏర్పాట్లు అత్యంత పటిష్టం గా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రేక్షకులకు సంబంధించిన మార్గదర్శకాలను, భద్రతా నియమా లను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఇందుకోసం మెట్రో రైళ్లలో నూ, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసే ప్రచార బోర్డుల ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ట్రాఫిక్‌ మళ్లింపు వివరాలను తెలియజేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా, అధికారులు ఉప్పల్‌ స్టేడియం భద్రతాపరమైన అనుకూ లతలను డీజీపీకి వివరించారు. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగు ణంగా ఉందని, సెక్యూరిటీ పరంగా చాలా అనువైనదని వారు తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మ్యాచ్‌ను ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని డీజీపీ తెలిపారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్‌ డీజీపీ మహేష్‌ ఎం.భగవత్‌, డీజీ ఎస్పీఎఫ్‌ స్వాతి లక్రా, అడిషనల్‌ డీజీపీ (సీఐడీ) చారు సిన్హా, అడిషనల్‌ డీజీపీ (ఇంటెలిజెన్స్‌) విజయకుమార్‌, డీజీ, ఫైర్‌ సర్వీసెస్‌ విక్రమ్‌ సింగ్‌ మాన్‌, జాయింట్‌ సీపీ (ట్రాఫిక్‌) జోయల్‌ డేవిస్‌, మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్‌, నార్కోటిక్స్‌ బ్యూరో ఎస్పీ పద్మజ, తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మెన్‌ కె. శివసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -