- Advertisement -
హనోయి : శుక్రవారం నాడు ముగిసిన వియత్నాం కమ్యూనిస్టు పార్టీ 14వ మహాసభ (జాతీయ కాంగ్రెస్) ప్రధాన కార్యదర్శిగా టో లామ్ను తిరిగి ఎన్నుకుంది. లామ్ 2024 నుండి ఈ పదవిలో ఉన్నారు. 14వ మహా సభలో ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికవ్వడం వల్ల ఆయన మరో ఐదేండ్లు ఆ పదవిలో కొనసాగనున్నారు.. కాగా, ఈ వారం ప్రారంభంలో ప్రారంభమైన ఈ మహాసభకు దాదాపు 1,600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. నిన్న 180 మందితో కేంద్ర కమిటీ ఎన్నికైంది. ఆ తర్వాత 19 మంది సభ్యులతో పొలిట్బ్యూరోను ఎన్నుకుంది. ఈరోజు పొలిట్బ్యూరో ప్రధాన కార్యదర్శిగా టో లామ్ను తిరిగి ఎన్నుకుంది.
- Advertisement -



