Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల్లో చిరిగిన గన్ని సంచులు.!

కొనుగోలు కేంద్రాల్లో చిరిగిన గన్ని సంచులు.!

- Advertisement -

ఆందోళనలో రైతులు 
నవతెలంగాణ – మల్హర్ రావు
: మండలంలోని రుద్రారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రంతోపాటు ఆయా కొనుగోలు కేంద్రాల్లో పాతవి, చిరిగిన గన్ని సంచులు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం వాటి ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఈఏడాది కూడా అదే తరహాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తోంది. కానీ చిరిగిన గన్ని సంచులు రావడంతో ధాన్యం 35 కిలోల నుంచి 38 కిలోల వరకు మాత్రమే తూకం వేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొను గోలు కేంద్రాలు ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్నది. ధాన్యం ఎక్కువ మొత్తంలో కేంద్రాలకు వస్తోంది. అందుకు తగ్గట్టుగా గన్నీ బ్యాగులు మాత్రం సరఫరా చేయడం లేదనే ఆరోపణలున్నాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం నుంచి సెంటర్లకు వాడిన బ్యాగులనే పంపిణీ చేస్తున్నారు. వాటిలో సగానికి పైగా పనికిరాని, చిరిగిన బ్యాగులే ఉంటున్నాయని రైతులు వాపోతున్నారు. 13 కేంద్రాల్లో ఇప్పటికి 24 విడతలుగా 1,01,150 లక్షల గన్ని సంచులు సరఫరా కాగా అందులో దాదాపు 1200 వరకు పనికి రాని చిరిగిన గన్ని సంచులు వచ్చినట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఒక లక్ష క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ధ్యం ఉంది. ఇప్పటికి 32,536 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేశారు. అకాల వర్షంతో ధాన్యం తడవకుండా 132 టార్పాలిన్ కవర్లు మాత్రమే పంపిణీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -