- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పటిష్టమైన నాయకత్వముతో పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం చేస్తూ రాష్ట్రములో పార్టీని బలోపేతం చేస్తూ, జనహిత పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి మహేష్ కుమార్ గౌడ్ కృషి చేస్తున్నారని సీనియర్ న్యాయవాది పీసీసీ మాజీ కార్యదర్శి కాందేశ్ శ్రీనివాస్ శనివారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల గుండెల్లో పదిలమైన స్థానం సంపాందించుకున్న ప్రజా నాయకుడు,అని పట్టు శాలువాతో ఘనంగా సన్మానించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ నాయకులు నదీమ్, న్యాయవాది ఏర్గట్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -