Thursday, June 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసమీప భవిష్యత్తులోనే వాణిజ్య ఒప్పందం : అమెరికా

సమీప భవిష్యత్తులోనే వాణిజ్య ఒప్పందం : అమెరికా

- Advertisement -

వాషింగ్టన్‌: భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇంకా ఎంతో సమయం పట్టదని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ తెలిపారు. రెండు దేశాలకు అనుకూలమైన స్థలాన్ని కనుగొన్నా మని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా కొద్ది రోజుల క్రితం ఇలాంటి ప్రకటనే చేశారు. భారత్‌తో సమీప భవిష్యత్తులోనే ఒప్పందం కుదురుతుందని ట్రంప్‌ చెప్పారు. వాషింగ్టన్‌ డీసీలో సోమవారం జరిగిన భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఎనిమిదో ఎడిషన్‌లో లుట్నిక్‌ ప్రసంగిస్తూ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పం దాన్ని ప్రస్తావించారు. ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌, అమెరికా దేశాలతో కూడిన క్వాడ్‌ గ్రూపు నుంచి హాజరైన వ్యాపారవేత్తలను సదస్సులో సన్మానించారు. వాణిజ్య ఒప్పందంపై ఆశాభావంతో ఉన్నారా అని ప్రశ్నిం చగా చాలా ఆశాభావంతో ఉన్నామని లుట్నిక్‌ బదులిచ్చారు. సదస్సు అనంతరం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ వీడియో ప్రకటనను పోస్ట్‌ చేస్తూ ‘రెండు దేశాల మధ్య గొప్ప సంబంధాలున్నాయి. ఉభయు లకూ ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరుగుతుందని నేను ఆశాభావంతో ఉన్నాను’ అని తెలిపారు. భారత వాణిజ్య మంత్రి పీయుశ్‌ గోయల్‌ గత వారం అమెరికాలో పర్యటించి ద్వైపాక్షిక ఒప్పందంపై లుట్నిక్‌తో చర్చించారు. ప్రతీకార సుంకాలు ప్రారంభమవ డానికి ట్రంప్‌ ఇచ్చిన 90 రోజుల గడువు లోగానే చర్చలు ముగించాలని భారత్‌ కోరుకుంటోంది. వచ్చే నెల 9న అమెరికా వాణిజ్య భాగస్వాము లపై ప్రతీకార సుంకాల అమలు ప్రారంభం కావాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -