- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మొహర్రం ఊరేగింపు వేడుకల కోసం ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడి 40 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా యరగుంటి గ్రామంలో చోటుచేసుకుంది. అందులో పరిగెడుతుండగా హనుమంత్ అనే 40 ఏళ్ల వ్యక్తి పడిపోయాడు. తీవ్రంగా కాలిపోయిన హనుమంత్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -