బాలు నాయుడు, ఆశా సుదర్శన్ జంటగా నటించిన సస్పెన్స్, మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘అరణ్య ధార’. సిల్వర్ స్క్రీన్ షాట్స్ బ్యానర్ పై నిర్మాత బాలు నాయుడు నిర్మించారు. దర్శక ద్వయం శివ పచ్చ, బాలు నాయుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ‘యుగానికే ప్రయాణమే’ను సంగీత దర్శకుడు, సింగర్ రఘు కుంచె లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘రవి నిడమర్తి సంగీతంలో రూపొందిన ఈ పాటని అమన్ సిద్ధిఖి ఎంతో అద్భుతంగా ఆలపించారు. దర్శక,నిర్మాత బాలు నాయుడు ఈ పాటకు సాహిత్యం సమకూర్చడం విశేషం.
ఇందులో హీరో ఒక ఫోటోగ్రాఫర్. ఈ పాటలో నేచర్ని బాగా చూపించారు. అలాగే ఈ పాట ఓ విజువల్ ట్రీట్లా ఉంది. వింటున్నప్పుడు కూడా చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని అన్నారు.
‘కొత్త కంటెంట్ను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అందులోనూ మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలను ఇప్పుడు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతో అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా మెప్పించేలాఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రానికి ‘అరణ్యధార’ అనే టైటిల్ని ఎందుకు పెట్టామనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే అద్భుతంగా ఉంటుంది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామనే నమ్మకం ఉంది’ అని మేకర్స్ తెలిపారు.
రేవతి నాధ, వెంకట్ పసుపులేటి, నాయకంటి స్వేతాంజలి, ప్రసాద్ పూసల, సంజరు సముద్రాల, జంజుర్ నిఖిల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం : శివ పచ్చ, బాలునాయుడు, సంగీతం : రవి నిడమర్తి, సినిమాటోగ్రఫీ : చైతన్య దామెర్ల.
‘యుగానికే ప్రయాణమే..’
- Advertisement -
- Advertisement -