నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని వివిధ తండాల చెందిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కొన్ని గిరిజన సంఘాల రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు చలో గాంధీభవన్ పిలుపు మేరకు బయలుదేరిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమ్ నాయక్ మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణలో లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లంబాడి మహిళలతో చీర,గాజులతో గాంధీ భవన్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తున్న సందర్భం లో ముందస్తు అరెస్ట్ చేసిన గాంధారి పోలీస్ లు లంబాడి నాయకులు అధికసంఖ్యలో వెళ్తున్న ఎక్కడికి అక్కడే అరెస్ట్ చేయడం జరిగిందని, అరెస్ట్ లతో ఉద్యమాని ఆపలేరని ఇకనైనా మంత్రి పదవి బంజారా నాయకులకు వెంటనే కేటాయించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
గిరిజన విద్యార్థి సంఘం నాయకులు అరెస్ట్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES