- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా కేంద్రంలోనీ న్యూ అంబేద్కర్ భవనంలో సోమవారం రాత్రి మహాకవి డా. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన బాల్కొండ ఉన్నత పాఠశాల విశ్రాంత తెలుగు పండిత్, గతంలో జిల్లా పరీక్షల నిర్వహణ తెలుగు విభాగం లో వింజామర వెంకట నరసయ్య విశిష్ట సేవలకు గాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల, డీఈవో అశోక్, డిసిసిబి సెక్రెటరీ సీతయ్య, ప్రొఫెసర్ కనకయ్య, జయంతి నిర్వహణ కమిటీ సభ్యులు కోనేరు సాయికుమార్, సిర్ప లింగం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -