నవతెలంగాణ – కామారెడ్డి
ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని తెలంగాణ వాదన్ని ప్రపంచానికి చాటిన మహజ్జని తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే బ్రిడ్జి, ప్రోబైల్ స్కూల్ వద్ద గల ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలతో నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ అదికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ హఫీజ్ బెగ్, మాజీ కౌన్సిలర్లు గెరిగంటి లక్ష్మినారాయణ, మాసుల లక్ష్మినారాయణ, సంగి మోహన్, మల్లేష్ యాదవ్, నాయకులు జగదీష్ యాదవ్, నర్సగౌడ్, ఆనందరాములు, రమణరావు, కృష్ణ యాదవ్, శ్యాం, ముఖిద్, లత, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ కు ఘన నివాళులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES