అమెరికా నుంచి అధికారికంగా ప్రతిపాదన..
విరమించుకున్న ఉక్రెయిన్ సభ్యుడు..
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీజీఎస్ఆర్టీసీలో 11 కార్మిక సంఘాలతో ఒకే జేఏసీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు ఆర్టీసీలో వేర్వేరుగా రెండు జేఏసీలు ఉన్న విషయం తెలిసిందే. ఒకే జేఏసీగా ఏర్పడేందుకు అనుకూలంగా గతంలోని రెండు జేఏసీలను రద్దు చేసుకుంటున్నట్టు ఆయా సంఘాల నేతలు ప్రకటించారు. మంగళవారం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అధ్యక్షతన 11 కార్మిక సంఘాల నేతల సమావేశం జరిగింది. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్), టీఎమ్యూ(అశ్వత్థామరెడ్డి), టీఎమ్యూ (థామస్రెడ్డి), ఎస్డబ్ల్యూయూ, టీజేఎమ్యూ, ఎన్ఎమ్యూ, బీడబ్ల్యూయూ, బీకేయూ, కార్మిక సంఫ్ు, కార్మిక పరిషత్, ఎస్టీఎమ్యూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఒకే జేఏసీగా ఏర్పడాలని అన్ని సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయని ఎస్డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు తెలిపారు. జేఏసీ విధివిధానాలపై చర్చించేందుకు జులై 2వ తేదీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. సంక్షోభాల్లో కూడా వేగంగా ఒప్పందాలు చేయించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారు. ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో పాత్ర ఉంది. ఆయన నాయకత్వాన్ని నోబెల్ ప్రైజ్తో గుర్తించాలి” అని కోరారు. ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య 12 రోజులపాటు సాగిన యుద్ధంలో కాల్పుల విరమణ కు ఆయన ఒప్పందం కుదిర్చారని చెబుతోంది. వాస్తవానికి యుద్ధం మధ్యలో దిగిన అమెరికా అధ్యక్షుడికి స్వదేశంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒత్తిడి తట్టుకోలేకే వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.. సాధారణంగా నోబెల్ శాంతి బహుమతి కి ఆయా దేశాల జాతీయ పార్లమెంట్ సభ్యులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, ఇతరులు నామినేషన్ల ను సమర్పించవచ్చు. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి తనను వరించకపోవచ్చని ఇటీవల కాలంలో ట్రంప్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆయన సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు చేస్తూ ”నేను ఏం చేసినా.. నాకు నోబెల్ ప్రైజ్ రాదు. భారత్-పాక్ మధ్య యుద్ధం ఆపినా.. సెర్బియా – కొసావో మధ్య పోరాటాన్ని నిలిపినా బ హుమతి లభించదు” అని విచారం వ్యక్తం చేశారు.
ప్రతిపాదన విరమించుకున్న ఉక్రెయిన్ సభ్యుడు..
ట్రంప్ పేరును ఉక్రెయిన్కు చెందిన చట్టసభ సభ్యుడు ఒలెక్సాండర్ మెరెఝాకో కూడా నోబెల్కు ప్రతిపాదించారు. కానీ, అమెరికా అధ్యక్షుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో విఫలం కావడంతో ఇప్పుడు తాజాగా ఆ నామినేషన్ను ఉపసంహరిం చుకుంటున్నట్టు ప్రకటించారు. తనకు ట్రంప్పై నమ్మకం పోయిందని ఆయన ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపుతానని ఎన్నికల వేళ ట్రంప్ హామీ ఇచ్చారు. ఆయన ప్రతి పాదించిన శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ అంగీకరి ంచినా..రష్యా ఒప్పుకోలేదు. ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం ట్రంప్ పేరును నోబెల్ ప్రైజ్కు నామినేట్ చేసింది. ఆ మర్నాడే ఆయన ఇరాన్పై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేయించారు. ఈ పరిణామాలతో ఒక్కసారిగా పాక్ షాక్కు గురైంది. తమ పొరుగుదేశంపైనే ట్రంప్ విరుచుకుపడటంతో ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి పాక్ ప్రతిపక్షాలు ఆ ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. నోబెల్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఇక భారత్ కూడా పాక్తో ఘర్షణను ట్రంప్ ఆపలేదని పలుమార్లు తేల్చిచెప్పింది.
నోబెల్ బహుమతి పై ట్రంప్ ఆకాంక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES