Saturday, July 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రపంచదేశాలకు కొత్త సుంకాల పైట్రంప్‌ లేఖలు

ప్రపంచదేశాలకు కొత్త సుంకాల పైట్రంప్‌ లేఖలు

- Advertisement -

గడువుకన్నా ముందే నిర్ణయాల వెల్లడి
శ్వేతసౌధం:
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాల వివరాలతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆయా దేశాలకు లేఖలు రాస్తున్నారు. అమెరికాతో ఒప్పందాలకు జులై 9వరకు గడువు ఉన్నా, అంతకంటే ముందే కొత్త టారిఫ్‌ రేట్లను పేర్కొంటూ లేఖలు రాస్తున్నారు.
శుక్రవారం నుంచి తమ వాణిజ్య భాగస్వాములకు ఈ లేఖలను పంపుతామని ఆయన ప్రకటించారు.


”అమెరికాతో వాణిజ్యం చేయాలంటే సుంకాలు ఎంత చెల్లించాలన్న దానిపై ఆయా దేశాలకు లేఖలు పంపనున్నాం. శుక్రవారం నుంచి నుంచి రోజుకు 10 దేశాల చొప్పున వీటిని పంపిస్తాం” అని ఆయన విలేకరులకు చెప్పారు. టారిఫ్‌లపై ఉన్న డెడ్‌లైన్‌ను పొడిగించవచ్చు లేదా కుదించవచ్చు అని కూడా చెప్పుకొచ్చారు. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్‌ 2న ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌, చైనా సహా పలు దేశాలపై భారీగా సుంకాలు విధించారు. అనంతరం ఆయా దేశాలతో ఎగుమతులు, దిగుమతుల టారిఫ్‌లపై నిర్ణయం తీసుకోవడం, వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం 90 రోజుల పాటు గడువు (జులై 9వ తేదీ వరకు) విధిస్తూ సుంకాల అమలును తాత్కాలికంగా నిలిపివేశారు.
కొనసా…గుతున్న చర్చలు
డెడ్‌లైన్‌లోగా అమెరికాతో ట్రేడ్‌ డీల్‌ కుదుర్చుకోకపోతే.. ఆయా దేశాలపై తమ ఇష్టానుసారం సుంకాలను విధిస్తామని ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలోనే భారత్‌, చైనా, బ్రిటన్‌ వంటి దేశాలు అగ్రరాజ్యంతో వాణిజ్య చర్చలు జరిపాయి. ఇప్పటికే కొన్ని కొలిక్కిరాగా.. భారత్‌తో చర్చలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల్లోగా ఇరుదేశాల మధ్య మినీ ట్రేడ్‌ డీల్‌ కుదిరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు చైనాతో ఒప్పందం కుదిరినట్టు ఇటీవల ట్రంప్‌ ఏకపక్షంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -