Wednesday, December 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమొరాకోలో కుప్పకూలిన రెండు భవనాలు..19మంది మృతి

మొరాకోలో కుప్పకూలిన రెండు భవనాలు..19మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మొరాకోలోని ఫెజ్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  రాత్రిపూట రెండు భవనాలు కూలిపోవడంతో 19 మంది మరణించారు. అలాగే 16 మంది గాయపడ్డారు. మృతులలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. స్థానిక అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -