నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లే లక్ష్యంగా చలో ఢిల్లీకి కాంగ్రెస్ ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉదయం 11 గంటల లకు జంతర్ మంతర్ లో తెలంగాణ కాంగ్రెస్ బీసీ ధర్నా చేయనుంది. ఈ ధర్నాకు లోకల్ పోలీసులు రెండు గంటల పాటు పర్మిషన్ ఇచ్చారు.
ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్మహేశ్కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలోని బీసీ నేతలు, బీసీ సంఘాల నాయకులంతా ఢిల్లీ చేరుకున్నారు. జంతర్మంతర్వద్ద సుమారు 2వేల మంది ప్రతినిధులతో తెలంగాణ సర్కారు చేపట్టనున్న ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని కీలక నాయకులు హాజరై తమ సంఘీభావం తెలుపనున్నారు.ఈ మేరకు స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.