- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఇటీవల జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్దాపురానికి చెందిన శ్రీను (30), వేట్లపాలేనికి చెందిన సత్యవేణి (34) గురువారం మృతి చెందారు. సామర్లకోట కుమ్మరవీధికి చెందిన వేమగిరి దావీదు మృత్యువుతో పోరాడుతున్నారు.
- Advertisement -



