న్యూఢిల్లీ: ప్రముఖ హిల్టన్ హోటల్స్ కొత్తగా ఢిల్లీ జిఎంఆర్ ఏరో సిటీలో రెండు హోటళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం జిఎంఆర్ గ్రూప్ నేతృత్వంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ స్థాయి హోటల్ రిసార్ట్స్ సేవలను ఢిల్లీలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు హిల్టన్ హోటల్స్ వెల్లడించింది. ఇందులో 150 రూములు, సూట్లు, అద్భుతమైన డైనింగ్, ఈవెంట్స్ కోసం అతిపెద్ద స్థలం, స్పా వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. హిల్టన్ సంస్థ జీఎంఆర్ ఏరోసిటీలో హౌటల్స్ ఏర్పాటుకు ముందుకు రావడంపై జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మెన్ కుమార్ గ్రంధి సంతోషం వ్యక్తం చేశారు.