- Advertisement -
నవతెలంగాణ – అచ్చంపేట
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమామహేశ్వరం కొండపై నుంచి ఉదృతంగా నీరు కిందికి వస్తుంది. బండ రాళ్లు రోడ్డుపై పడుతున్నాయి. దీంతో స్పందించిన పోలీస్ యంత్రాంగం దేవాలయ పరిసర ప్రాంతాలను గురువారం క్షణ్ణంగా పరిశీలించింది. ఈ నేపటథ్యంలోనే నేటి నుంచి మూడు రోజులు ఉమామహేశ్వరం దర్శనం నిలిపివేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. భక్తుల క్షేమం కోసం ముందు జాగ్రత్తగా దర్శనం ఆపేసినట్లు వెల్లడించారు. పరిస్థితులను ఆలయ కమిటీ సభ్యులు దగ్గరుండి తెలుసుకున్నారు. డీఎస్పీ వెంట సిఐ నాగరాజు, ఎస్సై విజయ భాస్కర్ ఉన్నారు.
- Advertisement -