Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలురైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : వేల్పూర్ మండలంలోని లక్కోరా శివారులో సోమవారం తెల్లవారుజామున రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పరిసర పంట పొలాల్లోకి వెళ్లే రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామానంతరం మృతదేహాన్ని తరలించారు. మృతి చెందిన వ్యక్తి జీన్స్ ప్యాంటు, బ్లూ షర్ట్, రెడ్ బన్యాన్ ధరించి ఉన్నాడు. తల తెగి పడటంతో వ్యక్తి ఎవరు అనేది గుర్తు పట్టడం కష్టంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి ఎవరనే వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad