- Advertisement -
-రన్ ఫర్ యూనిటిలో హెడ్ కానిస్టేబుల్ రమేశ్
నవతెలంగాణ-బెజ్జంకి
ఐక్యమత్యమే..అందరికి బలమని..శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యతని హెడ్ కానిస్టేబుల్ ఎం.రమేశ్ అన్నారు. పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహించిన ‘రన్ ఫర్ యూనిటి’ 3 కీ.మీ.పరగును శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద హెడ్ కానిస్టేబుల్ ఎం.రమేశ్ ప్రారంభించారు. స్నేహపూరిత భావాలతో అందరూ జీవనం సాగించాలని కానిస్టెబుల్ కొడిశెల శ్రీనివాస్ సూచించారు. పోలీసులు రవి,మాజీ ఏఎంసీ చైర్మన్ కచ్చు రాజయ్య,బీఆర్ఎస్ యువజన మండలాధ్యక్షుడు బిగుల్ల మోహన్,స్థానిక యవత పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    