– రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి
– ఎంజీ యూనివర్సిటీలో విద్యాభివృద్ధిపై ప్రజావిచారణ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకైన పాత్ర పోషించిన విశ్వవిద్యాలయాలు విద్యారంగం అభివృద్ధిలోనూ తోడ్పడాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం విద్యా కమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ఆచార్య పిఎల్.విశ్వేశ్వరరావు, డా చారకొండ వెంకటేష్, జ్యోత్స్న, శివారెడ్డి సందర్శించారు. వివిధ విభాగాల్లో మౌలిక వసతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రస్థానం, ప్రస్తుత స్థితిగతులపై ఉపకులపతి ఆచార్యఖాజా అల్తాఫ్ హుస్సేన్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం విశ్వవిద్యాలయ అధ్యాపక, బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో ‘ప్రజా విచారణ’ చేపట్టారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లా డుతూ.. విద్య అభ్యున్నతి, దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే ఉత్తమ సాధనంగా.. నైపుణ్యాలను అందించి నైతికత, సమతా భావన, దేశభక్తిని పెంపొందించే గురుతర బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థి సం ఘాల నాయకులు, ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలతో అధికారులు చర్చించారు. తమ కళాశాలలు, క్రీడా సదుపాయాలు, హాస్టల్లో సమస్య లపై విద్యార్థులు కమిషన్కు వివరించారు. సదుపాయాలతోపాటు పోటీ పరీక్షల సమాయత్తానికి వెసులుబాటు కల్పించాలని కోరారు. ఫీజురీయిం బర్స్మెంట్ నాలుగేండ్ల బకాయిల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్య లను ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు కమిషన్ దృష్టికి తీసుకొ చ్చాయి. కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకులు తమ సమస్యలను వివరిస్తూ.. సర్వీసుల క్రమబద్ధీకరణతోపాటు, సర్వీస్ గుర్తింపు ద్వారా న్యాయం చే యాలని కోరారు. మూడు అంచల వేతన విధానం ద్వారా నష్టపోతున్నా మని, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దుచేయాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ప్రిన్సిపాల్ డా శ్రీదేవి, డా అరుణప్రియ, డా సుధారాణి, ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, ఆచార్య రేఖ, డా మద్ది లేటి, డా.మిరియాల రమేష్, డా.దోమల రమేష్, అధ్యాపకులు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి విశ్వవిద్యాలయాల తోడ్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES