– జాతీయ భద్రతా కారణాలతోనే
– టారిఫ్ విధించామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఉక్కు, అల్యూ మినియంపై అమెరికా విధించిన సుంకాలకు వ్యతిరేకంగా ప్రతీకార చర్యలకు దిగుతానంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో భారత్ అందించిన నోటీసును ట్రంప్ ప్రభు త్వం తిరస్కరించింది. జాతీయ భద్ర తా కారణాలను దృష్టిలో ఉంచుకొని సుంకాలు విధించామని నోటీసును తిరస్కరిస్తూ అమెరికా స్పష్టం చేసింది. భారత్ చేస్తున్న వాదనలో విధానపర మైన లోపాలున్నాయని ఎత్తిచూపింది. ఉక్కు, అల్యూమినియంపై తాను విధించిన సుంకాలను భద్రతా చర్య లుగా భారత్ భావించిందని, అది తప్పని గత నెల 23న అమెరికా తెలియజేసింది. అమెరికా చట్టంలోని సెక్షన్ 232ప్రకారం సుంకాలు విధిం చామని, దిగుమతులను జాతీయ భద్రతకు ముప్పుగా భావించినందునే ఆ చర్య తీసుకున్నామని వివరించింది.
‘రక్షణ చర్యల ఒప్పందం ప్రకారం సెక్షన్ 232 కింద విధించిన సుంకా లపై అమెరికా చర్చించదు. ఎందు కంటే మేము సుంకాలను రక్షణ చర్యగా చూడడం లేదు’ అని వస్తువుల వాణిజ్యానికి సంబంధించిన డబ్ల్యూటీఓ మండలికి ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. కాగా ఉక్కు దిగుమతులపై సుంకాన్ని రెట్టింపు (యాభై శాతం) చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం నాడు ప్రకటించారు. అయితే ఈ చర్య దురదృష్టకరమని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘సుంకాలపై చర్చిద్దామని ఏప్రిల్ 16న మేము చేసిన ప్రతిపాదనకు భారత్ అంగీకరించలేదు. దీనిని బట్టి రక్షణ చర్యల ఒప్పందంలోని కర్తవ్యాలకు భారత్ కట్టుబడి ఉండలేదని అర్థమవుతోంది.’ అని అమెరికా తన నోట్లో చెప్పింది.
భారత్ ప్రతీకార సుంకాలకు అమెరికా ‘నో’
- Advertisement -
- Advertisement -