నవతెలంగాణ-హైదరాబాద్: వలసదారుల బహిష్కరణ కేసులో అమెరికా సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్కు మరోసారి చుక్కెదురైంది. దేశంలో అక్రమంగా ఉంటున్న వెనెజులాకు చెందిన గ్యాంగ్ను బహిష్కరించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ను వినియోగించి అమెరికాలో ఉంటున్న వెనెజులాకు చెందిన గ్యాంగ్ను బహిష్కరించాలని ట్రంప్ ప్రయత్నించారు. ఈ చర్యలకు అక్కడి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. వారి బహిష్కరణను చట్టబద్ధంగా సవాలు చేయడానికి వారికి తగినంత సమయం ఇవ్వాలని సుప్రీం తీర్పునిచ్చింది. దీనిపైనే ట్రంప్ తాజాగా స్పందించారు. యూఎస్లోకి చట్టవిరుద్ధంగా వచ్చిన వారిలో అనేకమంది హంతకులు, మాదకద్రవ్యాల వ్యాపారులు, నేరస్థులు ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా రాసుకొచ్చారు. ఆ తీర్పు ప్రకారం వారిని చట్టబద్ధంగా దేశం నుంచి పంపించేందుకు చాలా సంవత్సరాలు పడుతోందని, ఈలోపు వారు దేశంలో అనేక నేరాలకు పాల్పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు మరింతమంది నేరస్థులను యూఎస్లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రోత్సహిస్తున్నట్లే అవుతోందని ఆరోపంచారు. తమ దేశాన్ని రక్షించడానికి ప్రయత్నించిన జస్టిస్ అలిటో, జస్టిస్ థామస్లకు కృతజ్ఞతలు. ఇది అమెరికాకు చెడ్డ, ప్రమాదకరమైన రోజు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
వలసదారుల కేసులో యూఎస్ సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES