- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
భారత దేశంలో పరతంత్య్రాన్ని పారదోలిన గేయం వందే మాతరం. ఈ గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఈ గేయానిది 150 ఏళ్ల ప్రస్థానం.శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన వందే మాతరం ఉత్సవాల్లో అయా పాఠశాలల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి వందే మాతరం గీతాన్ని ఆలపించారు.
వందే మాతరం స్ఫూర్తిదాయకం:ఎస్ఐ సౌజన్య
వందే మాతరం గేయం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎస్ఐ సౌజన్య అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ యందు ఎస్ఐ సౌజన్య అధ్వర్యంలో సిబ్బంది వందే మాతరం గీతాన్ని ఆలపించారు.ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బంది వందే మాతరం గీతాన్ని ఆలపించారు.
- Advertisement -



