- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు పట్టణంలో ఆదివారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ సందర్భంగా ఈజిప్షియన్ పిరమిడ్ గోల్ బాల్ శాంపియన్షిప్ 2025 కు ఎంపికైన అంధ క్రీడాకారులకు బియ్యము, పప్పు, ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంగవైకల్యం ఉన్నా.. క్రీడలో ప్రతిభ చాటినందుకు అభినందించారు. ఈజిప్టులో మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాండ్ల శివకుమార్ వాసవి క్లబ్ అధ్యక్షులు మెలిశెట్టి దామోదర్, కార్యదర్శి కౌకుంట్ల యశ్వంత్, జిల్లా కోఆర్డినేటర్ సూరంపల్లి నవీన్ ,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -