- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన ఎత్తారి మాధవి ఆదివారం ఉదయం ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి నీ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం ఆమెకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబీన్ ఖాన్, సీనియర్ నాయకులు జావిదొద్దీన్, ఎత్తారిస్సాయలు, వెంకట్, దండు గుల రాజు, రాజా గౌడ్, రమేష్ గౌడ్, దుర్గయ్య, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



